జాతీయ వార్తలు
మోదీపై మళ్లీ కేజ్రీవాల్ ఆగ్రహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 27 August 2016
దిల్లీ: దిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో పదే పదే జోక్యం చేసుకుంటున్న ప్రధాని మోదీ మరిన్ని అరెస్టులకు ఆదేశాలిస్తారేమోనని సిఎం కేజ్రీవాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ల ఆదేశాలపై ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. దిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ను కూడా అరెస్టు చేసి జైలులో పెడతారని కేజ్రీ తాజాగా ట్విట్టర్లో పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితమే స్వాతి కార్యాలయంలో ఎసిబి దాడులు జరిగాయని, రేపటి అరెస్టులకు ఇది నిదర్శనమన్నారు. మోదీ, జంగ్ ప్రమేయంతో దిల్లీ ప్రభుత్వ పాలనలో ఆటంకాలేర్పడుతున్నాయన్నారు.