జాతీయ వార్తలు
కేజ్రీవాల్ సభకు అనుమతి నిరాకరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 29 June 2016
గాంధీనగర్: దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూరత్లో నిర్వహించతలపెట్టిన సభకు గుజరాత్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వచ్చే నెల 9,10 తేదీల్లో అరవింద్ కేజ్రీవాల్ రెండురోజుల పాటు గుజరాత్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. సోమనాథ దేవాలయ సందర్శన, రైతులతో ముఖాముఖి అనంతరం ఆయన సూరత్లో జరిగే సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే, సూరత్లో సభకు అనుమతించరాదని గుజరాత్ సర్కారు నిర్ణయించింది. రాజకీయ దురుద్దేశంతోనే గుజరాత్ సిఎం ఆనందీబెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు.