జాతీయ వార్తలు
ఎవరు అక్రమాలకు పాల్పడినా వేటు తప్పదు: కేజ్రీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 1 September 2016
దిల్లీ: విలువలకు కట్టుబడి తమ పార్టీ, ప్రభుత్వం పనిచేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సిఎం కేజ్రీవాల్ గురువారం మీడియాతో అన్నారు. తన మంత్రివర్గం నుంచి సందీప్కుమార్కు ఉద్వాసన పలికిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, తన పార్టీలో ఎవరు అక్రమాలకు పాల్పడినా క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. ఇద్దరు మహిళలతో మంత్రి సందీప్కుమార్ అశ్లీలంగా ఉన్నట్టు ఓ వీడియో బయటపడడంతో ఆయనపై కేజ్రీవాల్ వేటు వేసిన సంగతి తెలిసిందే. పార్టీ సిద్ధాంతాలకు తాను సైతం అతీతుడని కాదని, విలువలను విస్మరించడం కన్నా మరణించడం మేలని కేజ్రీవాల్ అన్నారు.