జాతీయ వార్తలు

కేరళ బంద్ హింసాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేరళలో బంద్ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారు జామున ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకోవటం పట్ల రాష్టవ్య్రాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల టైర్లను తగులబెట్టారు. వాణిజ్య సముదాయాలను మూసివేశారు. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బంద్ సందర్భంగా జనజీవనం స్తంభించింది. ఈ ఆందోళనలో గాయపడిన శబరిమల కర్మసమితి సభ్యుడు చంద్రన్ మృతిచెందాడు. పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.