ఖమ్మం

జెఎసి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, సెప్టెంబర్ 12: జూలూరుపాడు, ఏన్కూరు మండలాలను కొత్తగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై జెఎసి ఆధ్వర్యంలో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ దిష్టిబొమ్మను నాయకులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతమైన జూలూరుపాడు, ఏన్కూరు మండలాలు కొత్తగా ఏర్పాటయ్యే కొత్తగూడెం జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్నాయన్నారు. ఈరెండు మండలాల ప్రజల సౌకర్యార్థం, ఈ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా కొత్తగూడెం జిల్లాలో చేర్చాలని ప్రజలు కోరుతుండగా ఎమ్మెల్యే మదన్‌లాల్ మాత్రం ప్రజల కోరికను పట్టించుకోవటంలేదని నాయకులు ఆరోపించారు. జూలూరుపాడు నుంచి కొత్తగూడెం ప్రదర్శనగా వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం అందజేయనున్నట్లు నాయకులు తెలిపారు. ఈకార్యక్రమంలో జెఎసి కన్వీనర్ లకావతు గిరిబాబు, కోకన్వీనర్ వాంక్డోతు వెంకన్న, కట్రం స్వామి, పడమట నర్సాపరం సర్పంచ్ కట్రం మోహన్‌రావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చీమలపాటి భిక్షం, జిల్లా నాయకులు జాటోతు కృష్ణ, బానోతు ధర్మా, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఏదులాపురం గోపాలరావు, సిపిఐ పార్టీ డివిజన్ నాయకులు చింతా స్వరాజ్యరావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.