ఖమ్మం

రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, అక్టోబర్ 15: ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులను విస్మరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్టవ్రర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం మధిర నుండి ప్రారంభమైన యాత్రను వైరా రింగ్‌రోడ్‌లో ఆపారు. ఈసందర్భంగా ఆయన సైతం స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతు రాజ్యం లేదని ఆయన టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కొత్త ప్రాజెక్టు ఇంతవరకు ప్రారంభం కాలేదని ఇప్పటికీ ముఖ్యమంత్రి అధికారాలు చేపట్టి 3సంవత్సరాలు పూర్తయిందని అన్నారు.ఇకనుండి కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రైతులకోసం రోజుకో కార్యక్రమం చేపడతామని అన్నారు. ఇప్పటికైనా రైతులకోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా పోరాటాలు చేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు లావుడ్య రాములు నాయక్, పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, దాసరి దానియేలు, శీలం నర్సిరెడ్డి, పసుపులేటి మోహన్‌రావు, ఏదునూరి సీతారాములు పాల్గొన్నారు.