ఖమ్మం

రైల్వేస్టేషన్‌లో 17లక్షల కొత్తనోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 18: ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఇద్దరు వ్యక్తుల నుంచి 17.24లక్షల రూపాయలు రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో కోణార్క్ రైల్‌నుంచి దిగిన ఉపేందర్, మురళీకృష్ణల నుంచి 17.24లక్షల రూపాయల కొత్త రెండువేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. భగత్‌పూర్ నుంచి ఖమ్మం వచ్చిన వారు మిర్చి వ్యాపారం నిమిత్తం వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మిర్చి వ్యాపారం నిమిత్తం ఈ డబ్బులను తీసుకువచ్చినట్లు వారు చెబుతున్నా పొంతన లేని సమాధానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారంతో కొంతమంది మిర్చి వ్యాపారులు రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి వారిని విడిపించే ప్రయత్నం చేయడం, ఇందుకోసం రాజకీయపరమైన ఒత్తిళ్ళు కూడా తీసుకువచ్చినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం నిందితులను కోర్టుకు హాజరు పర్చనున్నట్లు తెలిపారు.