ఖమ్మం

రేపు తెలంగాణ రచయితల మహసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 16: ఈ నెల 18న తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహసభలు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ తిర్మల్ ఒ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటలకు ప్రారంభమయ్యే సభలో సాహిత్య, సాంస్కృతిక-వర్తమానం-సవాళ్లు అంశంపై జయధీర్ తిరుమల్‌రావుతో పాటు ప్రముఖ రచయితలు ప్రసంగిస్తారన్నారు. మధ్యాహ్నం 2గంటల నుండి ఎన్నికలు-ప్రజల కర్తవ్యాలు- రచయితలు అంశంపై, 3గంటల నుండి మేనిఫెస్టోలు-్భషా సాహిత్య, సాంస్కృతిక రంగాలు- వివిధ పార్టీలు అంశంపై పలువురు రచయితలు, ప్రముఖులు ప్రసంగిస్తారని తెలిపారు.

వినియోగదారుల రాష్ట్ర అధ్యక్షులుగా వెంకటేశ్వరరావు
ఖమ్మం(క్రైం), నవంబర్ 16: అవినీతి నిర్మూలన, వినియోగదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పల్లపోతు వెంకటేశ్వరరావు నియామకమయ్యారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సంపంగి శ్రీనివాసులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్ తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి వెంకటేశ్వరరావును అభినందించారు. కార్యక్రమంలో సిద్దంసెట్టి శ్రీకాంత్, కొదుమూరు భద్రయ్య, కందిబండ సూర్యుడు, ఓంకార్, రాజశ్రీ, ఆంజనేయులు, మహాంకాళి నాగేశ్వరరావు, నూకల సీతారామచంద్రమూర్తి, సంతోష్‌చక్రవర్తి, మురళీకృష్ణ, అశోక్ పాల్గొన్నారు.