ఖమ్మం

బంగారు తెలంగాణ కెసిఆర్‌తోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), మే 22: దీర్ఘకాలిక పోరాటంతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం అభివృద్ధి చేసే సత్తా ముఖ్యమంత్రి కెసిఆర్‌కే ఉందని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపి క్యాంపు కార్యాలయంలో పొంగులేటి సమక్షంలో చింతకాని మండలంలోని తూటికుంట్ల, కొదుమూరు గ్రామాల నుండి సిపిఎంకు చెందిన 150కుటుంబాలు ఆదివారం టిఆర్‌ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వనించారు. అనంతరం ఎంపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడిన కెసిఆర్ ప్రస్తుతం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో ఖమ్మం జిల్లా అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తాను శాయశక్తులా కృషి చేస్తానని హమీనిచ్చారు. తనపై నమ్మకంతో టిఆర్‌ఎస్‌లో చేరిన వారికి అండగా ఉంటానని బరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ నాయకులు లింగాల కమల్‌రాజ్, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కోటేశ్వరరావు, సీతారామయ్య, ఆనంతరెడ్డి, సూర్యప్రకాష్‌రావు, పుల్లరావు పాల్గొన్నారు.