ఖమ్మం

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), మే 30: ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్(న్యూడెమోక్రసి) జిల్లా కార్యదర్శి ఎస్‌కె ముక్తార్‌పాషా డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసి), అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లాలోని 16మండల కేంద్రాలలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పోడు భూములు ప్రభుత్వం లాక్కోవద్దు అంటూ, దళితులకు 3ఎకరాల భూమి వాగ్దానం అమలు చేయాలని సీతారామసాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని అవసరాలకు సాగు నీరు ఇవ్వాలని, రైతులకు విత్తనాలు, ఎరువులు, ఋణాలు సకాలంలో అందించాలని పలు డిమాండ్‌లతో ధర్నా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.