ఖమ్మం

కన్నీరు పెట్టిన ఆంజనేయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, మే 30: స్థానిక బ్రాహ్మణపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్న ఆంజనేయ విగ్రహానికి కన్నీరు కారుతున్న దృశ్యం సోమవారం పట్టణమంతా వ్యాపించింది. గత 3సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని ఆలయ పూజారి సతీష్‌శర్మ ఆలయ పాలకమండలిలో ఒక సభ్యుడిని అడిగినందుకు ఆయన పూజారిపై గొడవకు దిగడంతో పూజారి గత రెండు రోజులుగా ఆలయం మూసివేయడం జరిగింది. దీంతో దిగివచ్చిన పాలకమండలి సభ్యుడు అందరితో కలసి తిరిగి తన పొరపాటును అందరిముందు ఒప్పుకున్నారు. మళ్లీ పూజారి అందరి సమక్షంలో ఆలయ ద్వారాలు తెరిచారు. ఆ సమయంలో ఆంజనేయ విగ్రహం కన్నీరు పెడుతున్న దృశ్యం అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ విషయం పట్టణం అంతా దావనంలా వ్యాపించింది. ఈ విషయమై స్థానికంగా ఎంతో చర్చ జరుగుతుంది. అంతే ఈ దృశ్యాన్ని తిలకించడానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు తండోప తండాలుగా తరలివస్తున్నారు. స్థానికులు మాత్రం ఆంజనేయుడు కలతచెందే ఇదంతా జరుగుతుందని చర్చించుకుంటున్నారు. తమ ఆంజనేయుడు ఎంతో మహిమగలవాడని కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారంగా భక్తులు చెప్తున్నారు.