ఖమ్మం

అభివృద్ధికి కలిసి కృషి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 3: జిల్లాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి కృషి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాకు చెందిన మధిర జడ్పీటిసితో పాటు ముగ్గురు ఎంపిపిలు, పలువురు సర్పంచ్‌లు, ఇతర పార్టీలకు చెందిన ప్రధాన నేతలు కెసిఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా అభివృద్ధికి సహకరిస్తామన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఇటీవల జరిగిన పాలేరు ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారని, దానిని భవిష్యత్తు ఎన్నికలకు మార్గదర్శకంగా ఉండేలా చూడాలని అన్నారు. రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిని ఆయన సాదరంగా ఆహ్వానించి అభినందించారు. పార్టీలో చేరిన వారిలో మధిర జడ్పీటిసి మడు ప్రియాంక, చింతకాని ఎంపిపి దాసరి సామాజ్య్రం, కారేపల్లి ఎంపిపి పద్మావతి, 10మందికిపైగా సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వివిధ పార్టీల నేతలు, ఐదుగురు సొసైటీ డైరెక్టర్‌లు ఉన్నారు.