జాతీయ వార్తలు

కోల్‌కతా కమిషనర్ రాజీవ్ కుమార్ బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: కోల్‌కతా సిటీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు ఆయనను సీఐడీ ఏడీజీ అండ్ డీఐజీగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీసు డైరెక్టర్ (శాంతిభద్రతలు)గా విధులు నిర్వహిస్తున్న అనూజ్ శర్మను కోల్‌కతా సీపీగా బదిలీ చేసింది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులలో భాగంగా ఈ బదిలీలు జరిగాయి. కాగా శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను సిటీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మాయం చేశారని సీబీఐ అధికారులు ఆరోపించి ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని ప్రయత్నించగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సత్యాగ్రహ దీక్ష చేసిన విషయం విదితమే.