కృష్ణ

నాణ్యత లేని ఎల్‌ఇడి బల్బులపై సిపిఎం నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, జూన్ 9: రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్‌లో ఇచ్చిన ఎల్‌ఇడి బల్బులు సరిగ్గా వెలగటం లేదని, వీటిని రీప్లేస్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈమేరకు ట్రాన్స్‌కో ఎఇ భానుప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి పంపిణీ చేసిన ఎల్‌ఇడి బల్బుల్లో నాణ్యత లోపించడం వల్ల సరిగ్గా పనిచేయడం లేదని పేర్కొన్నారు. వీటి స్థానంలో కొత్తవి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌరిశెట్టి నాగేశ్వరరావు, మాజేటి శివ శ్రీనివాసరావు, పోసిన మోహనరావు, ఎల్ అజయ్ ఘోష్, పరుచూరి ధనశ్రీ, బొడ్డు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.