కృష్ణ

అక్రమంగా రవాణా చేస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరులపాడు, జూన్ 10: అక్రమంగా రవాణా చేస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యంను విజిలెన్స్ అధికారులు శుక్రవారం మండలంలోని పెద్దాపురం గ్రామ చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ఒక టాటా ఎసి, ఆటోల ద్వారా రేషన్ బియ్యం బస్తాలను లారీల్లో లోడింగ్ చేస్తుండగా విజిలెన్స్ సిఐ అపర్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావులు సిబ్బందితో దాడి చేసి బియ్యంతో సహా వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన బియ్యంపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ అవినాష్, సిబ్బంది పాల్గొన్నారు.