కర్నూల్

మైనార్టీల సంక్షేమానికి రూ. 370 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగలమర్రి, మే 30: రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి టిడిపి రూ.370 కోట్లను ఈ ఏడాది కింద కేటాయించినట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అహ్మద్ హుసేన్ తెలిపారు. సోమవారం చాగలమర్రిలో ఆయన మాట్లాడుతూ అలాగే బిసి కార్పొరేషన్ కింద రూ.842 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ కింద రూ.836 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్ కింద రూ.60 కోట్లు, కాపు కార్పొరేషన్ కింద రూ. 100 కోట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర విభజనతో రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నా సిఎం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీని చేశారన్నారు. పేద, బడుగు, బలహీన రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ బాటలోనే సిఎం చంద్రబాబు నడుస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈసమావేశంలో ఇరిగెల టిడిపి వర్గానికి చెందిన మండల పార్టీ కన్వీనర్ సుబ్బయ్య, జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి పూల బాషా, పార్టీ నాయకులు ఉపు మాబాషా తదితరులు పాల్గొన్నారు.