కర్నూల్

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ణగిరి, జూన్ 3:మండల పరిధిలోని ఎరుకలచెరువు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్డే మధు(16) మృతిచెందాడు. దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామానికి చెందిన మధు, ధనుంజయ, నాయుడు ముగ్గురూ స్నేహితులు. వారు క్రిష్ణగిరిలో జరుగుతున్న క్రికెట్ పోటీలను చూసేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. అయితే వారు ఆగవేలి గ్రామం దాటిన తర్వాత ఒక మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడ్డారు. ఈ సంఘటనలో మధు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ సోమ్లానాయక్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అలాగే మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.