కర్నూల్

వైభవంగా మహాచండీయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవెలకుంట్ల, జూన్ 9:పట్టణంలోని షిరిడీ సాయి దేవాలయం సమీపంలో గురువారం విశ్వశాంతి కోసం మహాచండీ యాగాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా తొలుత వివిధ రకాల పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అలాగే పంపాక్షేత్ర పీఠాధిపతి గోవిందానంద సరస్వతీస్వామి భక్తులకు ప్రవచనాలు బోధించారు. భక్తులు హోమంలో పాల్గొనేందుకు యాగశాలలు, హోమగుండాలు ఏర్పాటు చేశారు. సద్‌బ్రాహ్మణుల వేదమంత్రాల ఘోషతో యాగ ప్రదేశం మార్మోగింది. యాగంలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారం రోజుల పాటు జరిగే ఈ యాగం ముగిసేంత వరకూ కోవెలకుంట్ల పట్టణంలో మాంసాహార విక్రయం నిలిపివేశారు.