కర్నూల్
రోడ్డు ప్రమాదంలో హెడ్కానిస్టేబుల్ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 August 2016
ఓర్వకల్లు, జూలై 31:మండల పరిధిలోని హుసేనాపురం గ్రామం కల్వర్టు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జూపాడుబంగ్లాలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న దేవానందం(46) దుర్మరణం చెందాడు. దేవానందం ద్విచక్ర వాహనంపై కర్నూలు వైపు వస్తూ హుసేనాపురం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఓర్వకల్లు ఎస్ఐ చంద్రబాబునాయుడు తెలిపారు. కాగా ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దేవానందం స్వగ్రామం మండల పరిధిలోని ఎన్.కొంతలపాడు. ఇతడి మృతిపట్ల పోలీసు అధికారులు సంతాపం తెలిపారు.