కర్నూల్

రాజధాని నిర్మాణం పేర చంద్రబాబు వ్యాపారం.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఆగస్టు 2:సిఎం చంద్రబాబు రాజధాని అమరావతి పేరుతో నిత్యం విదేశాల్లో తిరుగుతూ సొంత వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారని పిఎసి చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్ పిలుపుమేరకు మంగళవారం నగరంలో బంద్ చేపట్టగా బుగ్గనను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి, అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా విదేశాల్లో పర్యటించి ఉండరని ఎద్దేవా చేశారు. ఆయన కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే కానీ రాష్ట్భ్రావృద్ధికి చేసిందేమీ లేదన్నారు. నెలలో 5నుంచి 10సార్లు ఢిల్లీ వెళ్తున్నారే కానీ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోతున్నారని, పక్క రాష్టమ్రైన తమిళనాడు సిఎం జయలలిత అపారంగా నిధులు రాబట్టారన్నారు. కారణం తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చంద్రబాఋ అడ్డంగా దొరికిపోయి కేంద్రం వద్ద నోరు మెదపలేకపోవడమే అన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. అటువంటి హోదా గురించి సిఎం చంద్రబాబు అది ఏమన్నా సంజీవనా అని పేర్కొనడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా వస్తే తనకు, తన పార్టీ నాయకులకు దోచుకోవడానికి వీలుకాదని భావించి ఆయన ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా సిఎం చంద్రబాబు స్పందించి రాష్ట్భ్రావృద్ధికి ఉపయోగపడే ప్రత్యేక హోదాపై గళం విప్పాలని లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.