జాతీయ వార్తలు

మధుర ఘర్షణలో 24మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర:ఉత్తరప్రదేశ్‌లోని ఓ పార్కులో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా ఒకవర్గానికి చెందిన ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య చెలరేగిన ఘర్షణలో 24మంది మరణించారు. మరణించినవారిలో ఎస్‌పి ముకుల్ ద్వివేది, ఓ ఎస్‌ఐతోపాటు 22మంది పౌరులు ఉన్నారు. కత్తులు, బాకులు, గ్రెనేడ్లు, రాళ్లతో ఆందోళనకారులు దాడులు చేశారు. తలకు రాయి తగలడంతో తీవ్రంగా గాయపడ్డ ఎస్‌పి ముకుల్ ఆస్ప్రత్రిలో చేరాక వరుసగా మూడుసార్లు గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు సిఎం అఖిలేష్‌యాదవ్ ప్రకటించారు.