జాతీయ వార్తలు
స్కర్టుల వివాదంపై కేంద్రమంత్రి మహేశ్ శర్మ వివరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 August 2016
దిల్లీ: భారత్ సందర్శనకు వచ్చే విదేశీ మహిళలు స్కర్టులు ధరించి రాకూడదని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. దీనిపై పలువురు విమర్శలు, ట్విట్టర్లో కామెంట్లు చేస్తుండడంతో మంత్రి వివరణ ఇచ్చారు. కేవలం మత సంబంధ ప్రదేశాల గురించి మాత్రమే మాట్లాడానని, మహిళలు ఏం ధరించాలో.. ఏం ధరించవద్దో తాను కామెంట్ చేయలేదని సోమవారం మహేశ్ శర్మ వివరణ ఇచ్చారు. మహిళల భద్రత గురించి ఆలోచించే మాట్లాడానన్నారు. ‘మహిళా పర్యాటకులు రాత్రిపూట కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. అందులో తప్పేముంద’ని శర్మ ప్రశ్నించారు.