మహబూబ్‌నగర్

ప్రతిపక్షాలను నిందిచడమే ప్రభుత్వ పనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, జూన్ 7: చేసిన తప్పులను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షాలను నిందించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. వెల్దండ మండలం బండోనిపల్లిలో మృతి చెందిన టిడిపి గ్రామకమిటీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బక్కని మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు సైతం ప్రతిపక్షాలు, గత పాలకులు, ఆంధ్రపాలకులే కారణమంటూ ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం ఎంతమాత్రం తగదన్నారు. టిడిపి ప్రభుత్వహయంలో పనిచేసిన ప్రస్తుత మంత్రులు ఆనాడు ఎందుకు ఆంధ్రపార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో టిడిపి తాలుకా ఇన్‌చార్జి బాలస్వామిగౌడ్, మాజి జడ్పీటిసి జంగయ్యగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు యోన్నం సింహారెడ్డి పాల్గొన్నారు.