మెదక్

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట, డిసెంబర్ 2: అందోల్ మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామశివారులో శుక్రవారం బైక్ లారీ ఢీకొన్న సంఘటనలో సాయిలు (45) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సాయిలు బ్యాంక్ పనుల నిమిత్తం సంగారెడ్డి జిల్లా జోగిపేటకు వస్తుండగా మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఆస్పత్రికి తరలించారు. జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
కొడకండ్ల శివారులో..
గజ్వేల్, డిసెంబర్ 2: గజ్వేల్ మండల పరిదిలోని కొడకండ్ల శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
ఈ సంఘటనకు సంబందించి బాదితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. రాయారం గ్రామానికి చెందిన గుల్లపల్లి శ్రీహరి(33) స్కూటీపై కొడకండ్ల వైపు వస్తుండగా, కుకునూరుపల్లి వైపు నుండి బైక్‌పై వస్తున్న కృష్ణ ఢీకొట్టాడు.
దీంతో శ్రీహరి అక్కడికక్కడే మృతి చెందగా, కృష్ణ తీవ్రగాయాలకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మృతుడు శ్రీహరికి బార్య మంజులతోపాటు ఇద్దరు పిల్లలు ఉండగా, బాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.