మెదక్

డిప్యూటీ స్పీకర్ కారుకు స్వల్ప ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, డిసెంబర్ 9: డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి శుక్రవారం ఉదయం చేగుంటలో ఓ వివాహానికి హాజరై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. మనోహరాబాద్ శివారులో ఆమె వెళ్తున్న వాహనానికి ముందుగా వెళ్తున్న తూప్రాన్ పోలీసుల ఎస్కార్ట్ వాహనానికి ఆకస్మికంగా ఓ ఆటో అడ్డు రావడంతో పోలీస్ వాహనానికి సడన్ బ్రేక్ వేశారు. దీంతో పద్మాదేవేందర్‌రెడ్డి వాహనం పోలీసు ఎస్కార్ట్ వాహనానికి ఢీకొంది. అలాగే డిప్యూటీ స్పీకర్ వాహనానికి వెనక ఉన్న మరో ఎస్కార్ట్ వాహనం పద్మాదేవేందర్‌రెడ్డి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో పద్మాదేవేందర్‌రెడ్డికి స్వల్ప గాయం అయింది. ఆమె వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయారు.
నేతల పరామర్శ
మెదక్ జిల్లా చేగుంటలో జరుగుతున్న ఒక వివాహ కార్యక్రమానికి శుక్రవారం బయలుదేరిని ఉపసభాపతి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న ఒకరిద్దరికి స్వల్పగాయాలు మినహా, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. హుటాహుటిన పద్మాదేవేందర్‌రెడ్డిని పరామర్శించేందుకు మెదక్ నుంచి చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ తెరాస అధ్యక్షులు గంగాధర్, కౌన్సిలర్లు ఐతారం నర్సింలు, అనిల్‌కుమార్, సలాం హైదరాబాద్‌కు తరలివెళ్లి ఆమె నివాసంలో పరామర్శించారు.

స్కూల్ వ్యాన్ బోల్తా
* విద్యార్థులకు స్వల్ప గాయాలు
మిరుదొడ్డి, డిసెంబర్ 9: అదుపుతప్పి స్కూల్ వ్యాన్ బోల్తా పడిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారంనాడు జరిగింది. మండల కేంద్రంలో బ్లుమింగ్ బర్డ్స్ స్కూల్ ఓమిన్ వ్యాన్ లక్ష్మీనగర్ గ్రామంలో విద్యార్థులను విడిచిపెట్టిన తదుపరి అదే పాఠశాలకు చెందిన ఓమినిలో తెలంగాణ మాడల్ స్కూల్ విద్యార్ధులను మిరుదొడ్డికి తీసుకవస్తున్న తరుణంలో ప్రాధమిక పాఠశాల వద్ద అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో వున్న స్వల్పగాయాలతో బయటపడ్డారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం పిర్యాదు మేరకు డ్రైవర్‌పై మిరుదొడ్డి పోలిసులు కేసు నమోదు చేసుకున్నారు.