మెదక్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, ఏప్రిల్ 30: ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామ శివారులో 65వ నంబరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన పరమేశ్వర్ గౌడ్ (56), అందోల్ మండలం నేరేడిగుంటకు చెందిన మల్లేశం (26) ఈ ప్రమాదంలో మృతి చెందారు.
పరమేశ్వర్ గౌడ్‌కు కోహీర్ మండలం వెంకటాపూర్‌లో ఉన్న స్వంత భూమి వద్ద బోరు మోటారు మరమ్మతుకు రావడంతో చూడటానికై మల్లేశంతో కలిసి స్విఫ్ట్ కారులో బయలుదేరారు. సరిగ్గా పెద్దాపూర్ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారు నడుపుతున్న పరమేశ్వర్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మల్లేశంను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాలకు పోస్టుమాస్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు సదాశివపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.