మెదక్

సీఎం కేసీఆర్‌కు.. శ్రీరామకోటి నామాల పుస్తకం అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, డిసెంబర్ 17: గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు సోమవారం శ్రీ రామ నామాల లిఖిత పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌కు ప్రగతిభవన్‌లో అందజేశారు. టీఆర్‌ఎస్ గెలుపు కోసం 25 సార్లు శ్రీ సీతారాముల కళ్యాణం, 35 సార్లు శ్రీ రామకోటి జప మహాయజ్ఞం నిర్వహించినట్లు సీఎం కేసీఆర్‌కు రామరాజు వివరించారు. అయితే 100 కోట్ల రామనామాల పుస్తకాలను ఇప్పటికే లిఖింపజేయగా, ఒకసారి వాటిని దక్కించుకొని పూజలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ను ఆయన కోరారు.
దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ త్వరలోనే గజ్వేల్ పర్యటన ఉన్నందున తప్పకుండా లిఖిత రామనామాల పుస్తకాలను దర్శించుకోనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు అధికారికంగా ఏర్పాట్లు చేయాలని అక్కడే ఉన్న మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్‌కు సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెదక్ పురపాలికకు 25 కోట్లు
* పురపాలక సంఘం కమిషనర్ సమ్మయ్య
మెదక్, డిసెంబర్ 17: ప్రభుత్వ ఉత్తర్వులు 763 జీవో ప్రకారం టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా 25 కోట్లు మెదక్ పురపాలక సంఘానికి విడుదలైనట్లు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య సోమవారం మాట్లాడుతూ తెలిపారు. ఇందులో 10 కోట్ల రుపాయలను ఇంటింటి నల్లా కనెక్షన్ కోసం ప్రపంచ బ్యాంక్ నిధులకు అధనంగా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ బ్యాంక్ మిషన్ భగీరథ క్రింద మెదక్ పట్టణానికి 50 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మెదక్ పురపాలక సంఘానికి మంజూరైన 25 కోట్లలో అధనంగా 10 కోట్లు తీసుకొని ఇంటింటి నల్లా కనెక్షన్ల కోసం వ్యయపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన 15 కోట్ల రుపాయలను పట్టణంలో గ్రేవ్‌యాడ్స్‌కు, ట్యాంక్‌బాండ్ బ్యూటిఫికేషన్ కోసం రాందాస్ చౌరస్తా, చేగుంట వెల్‌బోర్డ్ వద్ద జంక్షన్ నిర్మాణం, పార్కుల అభివృద్ది, మేజర్ డ్రైన్స్‌కు, రోడ్ల అభివృద్దికి వ్యయపరుస్తున్నట్లు తెలిపారు. అయితే జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అనుమతి ఇచ్చిన వెంటనే ఈ పనులు చేపడతామని సమ్మయ్య తెలిపారు.
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 17: జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హన్మంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
జిల్లాలోని రూరల్‌లో 3478, అర్బన్‌లో 2077 మొత్తం 5555 ఇళ్లు మంజూరు కాగా, టెండర్ల ప్రక్రియ పూర్తయి ఇప్పటి వరకు వరకు 4606 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమై వివిధ దశలలో ఉన్నాయని, సుమారు రూ.57.71కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ప్రారంభించిన ఇండలలో సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామంలో 50 ఇళ్లు పూర్తయినట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల పనులలో వేగాన్ని పెంచాలని, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందేలా చొరవ చూపాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు తాత్సరం చేయరాదని, పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు. నిర్ణీత లక్ష్యంగా ముందుకు వెల్లాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో హౌజింగ్ మేనేజర్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మరో 20 యేండ్ల వరకు.. టీఆర్‌ఎస్‌కు ఢోకా లేదు
గజ్వేల్, డిసెంబర్ 17: రాష్ట్రంలో మరో 20 యేండ్ల వరకు టీఆర్‌ఎస్‌కు డోకా లేదని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిల నేతృత్వంలో ఆయా పార్టీలకు చెందిన 200ల మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలువగా, పేదల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్దపీట వేసినందునే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు.
ముఖ్యంగా రైతుబంధు, రైతుభీమా, షాదీముబారక్, కళ్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ వంటి పథకాలు టీఆర్‌ఎస్ గెలుపునకు ఎంతో దోహద పడినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉండగా, ప్రతిపక్ష పార్టీల హామీలు ప్రజలు నమ్మనందునే ఆ కూటమిని మహాకూటమి అభ్యర్థులను పాతరేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పటిష్టతకు కృషి చేస్తుండగా, పార్టీలో ఎలాంటి వర్గాలు, విబేదాలు లేవని ప్రతి ఒక్కరూ కలసికట్టుగా సీఎం కేసీఆర్ ఆదేశాలను శిరసావహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, మండల టీఆర్‌ఎస్ బాద్యులు బెండ మదు, రైసస జిల్లా డైరెక్టర్ మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, మండల డైరెక్టర్ మద్ది రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊడెం కృష్ణారెడ్డి, లీగల్‌సెల్ నాయకులు అశోక్‌రెడ్డి, ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి, జాగృతి చైర్మెన్ రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.