మెదక్

అబద్ధాలతో అయోమయం సృష్టిస్తున్న పాలకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూలై 10: మల్లన్నసాగర్ పై పాలకులు అబద్ధాలు మాట్లాడి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని పౌరహక్కుల సంఘం నేత, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఆరోపించారు. ఆదివారం మండలంలోని వేములఘాట్‌లో 50 టిఎంసిల కన్నీళ్లు ఎవరికోసం- మల్లన్నసాగర్ నిజానిజాల పై ప్రజలకు నివేదిక అనే పుస్తకాన్ని దీక్ష మహిళలచే విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నదులు, కాల్వల పై ఫ్రాజెక్టులు నిర్మించారని, కానీ ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టును నిర్మించడం సాంకేతికం వీలుకాదన్నారు. ఎత్తుఫ్రాంతమని చెప్పి సారవంతమైన భూములున్న తొగుట, కొండపాక మండలాల్లో కాకుండా అంతకంటే ఎత్తుగా ఉన్న జగదేవ్‌పూర్ మండలం చేబర్తిలో నిర్మించాలన్నారు. కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఈ ఫ్రాజెక్టని, విధి విధానాలు, నిపుణుల సలహాలు లేకుండా ఏలా నిర్మిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కెయూ, శాతవాహన యూనివర్సిటి ప్రొఫేసర్లు కాత్యాయనీ విద్మహే, సుజాత, సిసిసి కోఆర్డీనేటర్ సజయ, రచయిత రజితలు మాట్లాడుతూ భూనిర్వాసితులకు మేలు చేసే 2013చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు మంజుల, నాయకులు బిఎస్ రాజు, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహరెడ్డి పాల్గొన్నారు.