మెదక్

బాలిక ఆత్మహత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జూలై 31: ఒంటిపై కిరోసిన్ పోసుకొని బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మంబోజిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుడగ జంగం రాజు, దుర్గ దంపతుల కూతురు స్వప్న (17) ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. చదువుమానేసి ఇంటి వద్దనే ఉంటున్న స్వప్న అప్పటి వరకు తల్లితో మాట్లాడుతూనే తల్లి ఇంటి నుండి బయటకు వెళ్లగానే ఆత్మహత్యకు పాల్పడింది.
తండ్రి రాజు పాతసామాగ్రి వ్యాపారం కోసం బయటకు వెళ్లాడు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని మెదక్ ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్, రూరల్ ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌లు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.