జాతీయ వార్తలు
48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 September 2016
ముంబై: పాకిస్థాన్ నటీనటులు, ఆర్టిస్టులు 48 గంటల్లో ఇండియా వదిలిపెట్టి వెళ్లి పోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చెందిన చిత్రపట్ కర్మచారి సేన శుక్రవారం హెచ్చరించించింది. ఉరీ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో అల్టిమేటం జారీ చేసింది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్థాన్ ఆర్టిస్టులు మూటముళ్లె సర్దుకుని వెళ్లిపోవాలని చిత్రపట్ సేన అమేయ్ ఖోపాక్ అన్నారు. ‘ 48 గంటలు సమయం ఇస్తున్నాం. ఒకవేళ వారు వెళ్లకపోతే మహారాష్ట్ర నవనిర్మాణ సేన బయటకు గెంటేస్తుంద’ని అమేయ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు గులామ్ అలీ ఇటీవల ముంబై జరగాల్సిన తన ప్రదర్శనను రద్దు చేసుకున్నారు. పాకిస్థాన్ కళాకారులకు వ్యతిరేకంగా శివసేన, ఎమ్మెన్నెస్ గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది.