జాతీయ వార్తలు
2025 నాటికి టీబీని నిర్మూలిస్తామని మోదీ ప్రకటన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 June 2018
న్యూఢిల్లీ: ‘ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన కార్యక్రమం’ లబ్ధిదారులతో మోదీ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా గురువారం ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందుబాటు ధరలకే ఔషధాలను అందించడం కోసమే భారతీయ జనఔషధి పరియోజన కార్యక్రమం ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. స్టెంట్ ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. భారత్ లో క్షయ వ్యాధి (టీబీ)ని 2025 నాటికి నిర్మూలించాలని లక్ష్యాన్ని విధించుకున్నట్టు ప్రధాని చెప్పారు. ఇది ప్రపంచ డెడ్ లైన్ కంటే ఐదేళ్లు ముందే కావడం గమనార్హం.