జాతీయ వార్తలు

సురాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరి : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: సురాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరని, మాన్యుడి జీవితంలో మార్పు తీసుకురావడమే సురాజ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 70వ స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు మనమందరం సంకల్పించుకోవాలన్నారు. ప్రగతి గతిని మార్చి అభివృద్ధిని కొత్తబాటలో నడిపించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో జనజీవనంలో కొత్త మార్పులు తీసుకురావాలని మోదీ పిలుపునిచ్చారు.