జాతీయ వార్తలు

జుహు బీచ్‌లో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయి జుహు బీచ్‌లో గల్లంతయిన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అంధేరిలోని డిఎన్ నగరం ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు నిన్న జుహు బీచ్‌కు వెళ్లారు. వీరిలో ఐదుగురు యువకులు సముద్రంలోకి దిగారు. నలుగురు గల్లంతయ్యారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతయినవారి మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా ఒక మృతదేహం లభించాల్సి ఉందని, నేవీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.