జాతీయ వార్తలు
కాంగ్రెస్ నేతలకు మాట్లాడే హక్కులేదు: వెంకయ్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 8 September 2016
దిల్లీ: ఎపికి అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతలకు నేడు మాట్లాడే హక్కు లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన గురువారం సాయంత్రం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, నేడు ఎపిలో దీన పరిస్థితికి కాంగ్రెస్ వారే కారకులన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ చూడని విధంగా కొద్ది గంటల వ్యవధిలోనే ఎపికి మంచి ప్యాకేజీని కేంద్రం అందించిందన్నారు. ఎపికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి క్యాబినెట్ భేటీలోనే పోలవరం ముంపు మండలాలపై ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఎపికి ఆర్థిక లోటును భర్తీ చేసి ఆదుకుంటామన్నారు.