జాతీయ వార్తలు

కాంగ్రెస్‌ది రెండునాల్కల ధోరణి: వెంకయ్యనాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వవైఖరి అవలంబిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. సున్నితమైన అంశంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిదంబరం వాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. కాశ్మీర్ లోయలో శాంతికోసం అన్ని పార్టీలు సహాకరించాలని కోరారు. దేశ రక్షణపై కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, ప్రజల సెంట్‌మెంట్ దృష్టిలో పెట్టుకుని పార్టీలు నడుచుకోవాలని ఆ పార్టీకి సూచించారు. కాశ్మీర్ అంశంపై కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, చిదంబరం చేసిన వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పేర్కొనటం సరైంది కాదన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ విమర్శలు చేస్తే, దాన్ని కాంగ్రెస్ తప్పపట్టడం సరైంది కాదన్నారు. రాజకీయావసరాల కోసమే కాంగ్రెస్ కాశ్మీర్‌పై అనవసర వ్యాఖ్యలు చేస్తుందని విమర్శించారు.