జాతీయ వార్తలు

సహనం కోల్పోయిన కేరళ సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచి, ఏప్రిల్ 24: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం సహనం కోల్పోయారు. మీడియాపై పెద్దపెద్ద కేకలు వేస్తూ ‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అని అరిచారు. ఉదయం ఆయన ప్రభుత్వ గెస్టు హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆయన బయటకు వచ్చే సమయంలో రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అత్యధిక శాతం నమోదు కావడానికి కారణమేమిటని మీడియా ఆయనను ప్రశ్నించింది. దీంతో ఆయన సహనం కోల్పోయారు. ‘ముందు మీరు ఇక్కడి నుంచి బయటకు పొండి’ అని వారిపై పెద్దగా అరిచారు. సీఎం దురుసు ప్రవర్తన పట్ల మీడియా విస్తుపోయింది. కాగా గత 30 ఏళ్లుగా ఎన్నడూ లేనంత ఎక్కువగా 77.68 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. 2.61 కోట్ల మంది ఓటర్లున్న రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.