జాతీయ వార్తలు

బోల్ట్‌కు పతకాలు ఎందుకొచ్చాయంటే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: జమైకా అథ్లెట్ ఉసేయిన్ బోల్టు ఒలింపిక్స్‌లో 9 బంగారు పతకాలను సాథించడానికి కారణం.. గొడ్డు మాంసం తినాలని అతడి కోచ్ సలహా ఇవ్వడమేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బిజెపి ఎంపీ, దళిత నాయకుడు ఉదిత్ రాజ్ కలకలం సృష్టించారు. ఆయన వ్యాఖ్యలపై బిజెపితో పాటు వివిధ వర్గాలకు చెందిన నేతలూ విరుచుకుపడ్డారు. దాంతో తప్పుతెలుసుకున్న ఉదిత్ వివరణ ఇచ్చారు. తన మాటల్ని వక్రీకరించారని, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎలా రాణించాలో చెప్పేందుకే తాను అలా మాట్లాడానని తెలిపాడు. కెన్యా, జమైకాలతో పోలిస్తే క్రీడలపై భారత ప్రభుత్వం భారీ మొత్తానే్న ఖర్చు చేస్తోందన్నారు. ‘ఉసేయిన్ బోల్ట్ రెండుసార్లు గొడ్డు మాంసం తినాలని అతడి కోచ్ సలహా ఇచ్చాడు. అందుకే తొమ్మిది బంగారు పతకాలు సాధించాడు’ అని ఉదిత్ ట్వీట్‌లో వ్యాఖ్యలు చేశారు.