జాతీయ వార్తలు

మైనారిటీ కమిటీ సభ్యులుగా బండి సంజయ్, గడ్డం రంజిత్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్ర స్థాయి మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యులుగా కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ (బీజేపీ), చెవేళ్ల లోక్‌సభ సభ్యుడు రంజిత్‌రెడ్డి (టీఆర్‌ఎస్)లను మైనారిటీ వ్యవహారాల శాఖ నియమించింది. వీరిద్దరినీ నామినేట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఎక్కాకు కేంద్ర మైనారిటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి జన వికాశ్ కార్యక్రమ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 15 ప్రధాన కార్యక్రమాలను మైనారిటీ సంక్షేమానికి వివిధ ప్రాజెక్టులను ప్రతిపాదించి అమలుచేయడం ఈ కమిటీ బాధ్యత. మైనారిటీల విద్యకోసం సర్వ శిక్షా అభియాన్, కస్తూర్బా బాలికా విద్యాలయ పథకం, ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం, ఉర్దూ భాష ఉపాధ్యాయుల నియామక ప్రక్రి య, మదర్సా విద్యా విధానం ఆధునీకరణ తదతర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.