జాతీయ వార్తలు

జగన్‌కు దక్కని షా అపాయింట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కాలేకపోయారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పనులతో అమిత్ షా తీరిక లేకుండా ఉన్నందువల్ల జగన్‌ను కలుసుకోలేకపోయారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షాతో సమావేశమయ్యేందుకు జగన్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చారు. మంగళవారం కూడా ఢిల్లీలోనే ఉండి అమిత్ షాతోపాటు మరి కొందరు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రిని ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నారు? ఏ అంశాల గురించి చర్చించాలనుకుంటున్నారనేది స్పష్టం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంతక్రితం ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా అమిత్ షాను కలుసుకునేందుకు ప్రయత్నించినా వివిధ కారణాల మూలంగా అది జరగలేదు. ఇదిలాఉంటే ఏపీకి చెందిన ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక యజమాని ఇటీవల ఢిల్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పత్రిక, టీవీ చానల్‌కు ప్రకటనలు నిలిపివేయటం, కక్ష్ ధింపు చర్యలకు దిగటం గురించి అమిత్ షాకు ఫిర్యాదు చేయటం తెలిసిందే.