జాతీయ వార్తలు

ఓయు శత జయంతికి 175కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: తెలంగాణా రాజధాని హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం 175 కోట్ల గ్రాంటు ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. దత్తాత్రేయ మంగళవారం సాయంత్రం ప్రకాశ్ జవదేకర్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం శత జయంతి ఉత్సవాల కోసం 175 కోట్ల ఒక్కసారి గ్రాంటు ఇవ్వాలని విజప్తి చేశారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు గ్రాంటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ రామచంద్రమ్ పంపించిన వినతిపత్రాన్ని జవదేకర్‌కు దత్తాత్రేయ అందజేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి 2017-18కి వంద సంవత్సరాలు అవుతుందని అంటూ జాతి నిర్మాణం కోసం ఈ విశ్వవిద్యాలయం చేసిన కృషిని గుర్తించవలసిన అవసరం ఉన్నదని దత్తాత్రేయ సూచించారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా విశ్వవిద్యాలయంలో వౌలిక సదుపాయాలను ఆధునీకీకరించవలసిన అవసరం ఉన్నదని సూచించారు.