జాతీయ వార్తలు

గూఢచర్యం కేసులో ఎంపి పిఏ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: గూఢచర్యం కేసులో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మున్వర్ సలీం వ్యక్తిగత కార్యదర్శి (పిఏ) ఫర్హత్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ గూఢచర్యం రాకెట్‌ను నడుపుతున్న ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన ఉద్యోగి మహమూద్ అఖ్తర్‌ను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు అయిన నాలుగో వ్యక్తి ఫర్హత్. శుక్రవారం రాత్రి సలీం నివాసంలో ఉన్న ఫర్హత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ తరువాత శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు. ఫర్హత్ విచారణ సందర్భంగా ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న మరి కొందరి పేర్లు బయటకు వచ్చాయని ఆయన వివరించారు.