జాతీయ వార్తలు

రాష్టప్రతి, ప్రధాని శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు రాష్టప్రతితోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ ప్రజలందరూ సుఖఃసంతోషాలతో ఉండాలి. దీపావళి ప్రజల జీవితాల్లో చీకట్లను పారదోలాలి. భవిష్యత్ అంతా సిరి సందలతో అలరాలాలి’ అని ఓ సందేశంలో ప్రణబ్ స్పష్టం చేశారు. దుష్టశక్తిపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దివ్వెల పండుగ జరుపుకొంటున్నట్టు ఆయన అన్నారు. భారతీయుల జీవితాల్లో వెలుగు విరాజిల్లాలని రాష్టప్రతి పేర్కొన్నారు. దేశం శాంతి, సౌభ్రాతృత్వంతో ఉండాలన్నారు. కాలుష్యానికి దూరంగా ప్రజలందరూ దీపావళి పండుగను జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.