జాతీయ వార్తలు

భార్యా పిల్లలను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లఖింపూర్ ఖేరి (యుపి), నవంబర్ 5: కట్టుకున్న భార్యను, ముక్కుపచ్చలారని నలుగురు ఆడపిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపిన ఓ వ్యక్తికి స్థానిక కోర్టు ఉరిశిక్షను విధిస్తూ శనివారం తీర్పు ఇచ్చింది. దీంతోపాటు 20వేల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. జిల్లా సెషన్స్ జడ్జి రాజ్‌బీర్ సింగ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని నాందార్‌పూర్వాకు చెందిన శివరాజ్ యాదవ్ రామానంద్ తన భార్య, పిల్లలను చంపి, మరో వివాహం చేసుకోవాలని పథకం పన్నాడు. 2010 జనవరి 22న తన భార్య సంగీత (32)ను, కుమార్తెలు తులసి (7), లక్ష్మి (5), కాజల్ (3)తోపాటు రెండు నెలల పసికందును అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం కిరోసిన్ పోసి తగులబెట్టాడు. తర్వాత తన ఇంట్లో దొంగలు పడి తన కుటుంబ సభ్యులను చంపినట్లు ప్రచారం చేశాడు. అయితే ఈ హత్యలన్నిటికీ రామానందే కారకుడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు రామానంద్‌కు ఉరిశిక్షను విధిస్తూ తీర్పుచెప్పింది.