జాతీయ వార్తలు
కుటుంబాలతో విహార యాత్ర!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సూరత్, నవంబర్ 5: గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఖరీదయిన బహుమతులు ఇవ్వడం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఆయన దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన 1200 కార్లు, 400 ప్లాట్లు తన ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్లుగా ఇచ్చారు. అదే విధంగా సూరత్కే చెందిన మరో వజ్రాల వ్యాపారి గోవింద్ ధోలాకియా కూడా అదే బాటలో నడుస్తూ తన కంపెనీలో పని చేసే 300 మంది ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్గా 15 రోజులు వేతనంతో కూడిన సెలవు ఇవ్వడమే కాకుండా వారినందరినీ కుటుంబాలతో సహా ఉత్తరాఖండ్కు విహార యాత్రకు తీసుకెళ్లారు. సూరత్, ముంబయిలలో శ్రీ రామకృష్ణ ఎక్స్పోర్ట్స్ పేరుతో ఆయనకు వజ్రాల ఎగుమతి వ్యాపారం ఉంది. దాదాపు 1200 మంది కోసం గోవింద్ ధోలాకియా 90 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక ప్రత్యేక ఎసి రైలునే బుక్ చేశారు. అంతేకాదు వారితో పాటుగా ఆయన కూడా ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి ప్రయాణించారు. విహార యాత్రకోసం వచ్చిన వీరంతా కేవలం యాత్రకే పరిమితం కాకుండా సామాజిక సేవలోకూడా పాల్గొనడం మరో విశేషం. వీరంతా రుషీకేశ్లోని రామ్ ఝూలా వద్దనుంచి వేద్ నికేతన్ ఆశ్రమ్ దాకా దాదాపు అరకిలోమీటర్ దారిని శుభ్రం చేయడం ద్వారా స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచారని స్వర్గాశ్రమ్ నగర్ పంచాయతీ అధ్యక్షుడు చెప్పారు.