జాతీయ వార్తలు

ఏసిబి వలలో పోర్టు అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, నవంబర్ 17: గుజరాత్‌లో 2.9 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న కాండ్లా పోర్టుట్రస్ట్ (కెపిటి) అధికారులు ఇద్దరు, మరో దళారిని అవినీతి నిరోధక శాఖ పట్టుకుంది. ఓ ప్రైవేటు సంస్థ నుంచి అన్నీ కొత్త 2000 రూపాయల నోట్లు లంచంగా తీసుకుంటూ దొరికిపోయారు. కెపిటి క్లాస్-1 సూపరింటిండెంట్ ఇంజనీర్ పి.శ్రీనివాసు, సబ్ డివిజనల్ అధికారి కె.కుమెట్కర్, మధ్యవర్తి రుద్రేశ్వర్ సునాముడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసిబి అధికారులు వెల్లడించారు. ఓ పనికి సంబంధించి కాంట్రాక్టరుకు కోటి రూపాయల బిల్లులు క్లియర్ చేయడానికి లంచం అడిగారు. శ్రీనివాసు 2.5 లక్షలకు, కుమేట్కర్‌కు లక్షన్నర ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని కచ్ ఏసిబి ఇన్‌స్పెక్టర్ హెచ్‌ఎం కన్సాగర వెల్లడించారు. కెపిటి అధికారులు ఇద్దరినీ అరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఫిర్యాదిదారునుంచి ఇంతకుముందే తీసుకున్న 40 వేల నగదును కుమేట్కర్ ఇంటినుంచి అధికారుల స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నాలుగున్నర లక్షల నగదును వారివద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.