జాతీయ వార్తలు

ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 17: జమ్ము కాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు తెగబడ్డారు. శ్రీనగర్- జమ్ము జాతీయ రహదారిలో రద్దీ ఎక్కువగా ఉండే పాంపోర్ వద్ద ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందారని, ఇద్దరు గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. పుల్వామా జిల్లాలో ఉన్న పాంపోర్ రద్దీ ప్రాంతంలో దాడి జరపడంతో పౌరుల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా సైన్యం సంయమనం పాటించింది. ప్రాథమిక విచారణ ప్రకారం ఉగ్రవాదులు మోటార్‌సైకిళ్లపై వచ్చారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. దాడి జరిగిన సమయంలో ఆర్మీ కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తోంది. గాయపడిన ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్ 25న ఇదే హైవేపై ఓ ప్రమాదకరమలుపు వద్ద ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసి ఎనిమిది మంది అధికారులతో సహా పది మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

చిత్రం..పాంపోర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో సైనికుల గాలింపు చర్యలు