జాతీయ వార్తలు

యూపీలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 8: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తప్పతాగిన ఇద్దరు యువకులు కన్నూమిన్నూ కానకుండా కారు నడిపి, రోడ్డు పక్కన షెల్టర్‌లో నిద్రిస్తున్న ఐదుగురు కూలీలను పొట్టనపెట్టుకున్నారు. హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని దాలిబాగ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు మాజీ ఎమ్మెల్యే కొడుకు కావడం గమనార్హం. పగలంతా పనిచేసి అలసిపోయిన కూలీలు తమకు కేటాయించిన షెల్టర్‌లో నిద్రిస్తున్న సమయంలో ఆయుష్ కుమార్, నిఖిల్ అరోరా అనే ఇద్దరు యువకులు పూటుగా తాగి కారులో అతివేగంగా షెల్టర్‌లోకి దూసుకొచ్చారు. ఆ సమయంలో షెల్టర్‌లో నిద్రిస్తున్న కూలీలమీదనుంచి కారు పోవడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతులంతా 30 నుంచి 37 ఏళ్ల మధ్య వయసువారే. నిందితుల్లో ఆయూష్ కుమార్ సమాజ్‌వాద్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడని గుర్తించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, కారును సీజ్ చేశారు. సంఘటన జరిగిన సమయంలో షెల్టర్‌లో 35మంది కూలీలు నిద్రిస్తున్నట్టు తెలిసింది.