జాతీయ వార్తలు

25న హాజరుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్, జనవరి 13: కృష్ణ జింకను వేటాడిన కేసులో వాంగ్మూలాలను న మోదు చేసేందుకు ఈ నెల 25న న్యాయస్థానంలో హాజరు కావలసిందిగా జోధ్‌పూర్ కోర్టు శుక్రవారం బాలీవుడ్ నటు లు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలం, టాబులను ఆదేశించింది. 1998నాటి ఈ కేసులో కోర్టులో ప్రవేశపెట్టిన అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తరువాత చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దల్పత్ సింగ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. సల్మాన్ ఖాన్ రాజస్థాన్‌లోని కన్‌కణి గ్రామంలో కృష్ణ జింకను వేటాడినట్లు, అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నట్టు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. మిగతా నలుగురు సహ నిందితులు కృష్ణ జింకను వేటాడిన సమయంలో సల్మాన్ ఖాన్‌తో ఉన్నారు. 1998 అక్టోబర్ ఒకటో తేదీన ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.