జాతీయ వార్తలు

రెండు వారాలలో సమాధానమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో రెండు వారాలలో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా జెరూసలెం మత్తయ్యను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్య పేరును తొలగిస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం జెరూసలెం మత్తయ్యను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.