జాతీయ వార్తలు

టెన్త్ రాజాజీ మార్గ్‌లో ప్రణబ్‌కు వసతి సదుపాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: రాజధాని ఢిల్లీలోని టెన్త్ రాజాజీ మార్గ్‌లోని కేంద్ర మంత్రి మహేశ్ శర్మ అధికార నివాసాన్ని జూలైలో రిటైర్‌కానున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి కేటాయించనున్నారు. టెన్త్ రాజాజీ మార్గ్‌లోని భవనంలో మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్ ఉండేవారు. ఆయన మరణించేవరకూ అందులోనే ఉన్నారు. తరువాత కేంద్ర మంత్రి మహేశ్ శర్మకు దాన్ని కేటాయించారు. గౌతమ్‌బుద్ధానగర్ ఎంపీగా ఉన్న శర్మ నొయిడా సెక్టర్ 15లో ఉంటున్నారు. టెన్త్ రాజాజీ మార్గ్‌లోని నివాసాన్ని అధికార కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. రోజువారీ అధికార సమావేశాలు ఇక్కడే నిర్వహించుకుంటున్నారు. కాగా మాజీ రాష్టప్రతికి అద్దెలేకుండా ప్రభుత్వమే వసతి కల్పిస్తుంది. దేశంలో ఎక్కడైనా ఉండవచ్చు. అలాగే ఉచితంగా విద్యుత్, నీటి సదుపాయం కల్పిస్తారు. 1962 రాష్టప్రతి పెన్షన్స్ నిబంధనల కింద వీటిని కల్పిస్తారు. టెన్త్ రాజాజీ మార్గ్‌లోని భవనం 11,776 చదరపు అడుగుల స్థలంలో ఉంది.